యాసంగి-2025 సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు ‘రైతు భరోసా’ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టా అయిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
పెద్దేముల్ మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ ప్రీతమ్
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు: అర్హులైన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారంతో పాటు ఈ క్రింది పత్రాల జిరాక్సులను తమ క్లస్టర్ ఏఈఓ (AEO)లకు సమర్పించాల్సి ఉంటుంది:
పట్టాదార్ పాస్బుక్
ఆధార్ కార్డు
బ్యాంకు ఖాతా పుస్తకం (బ్యాంకు వివరాల మార్పు కోరుకునే వారు కూడా ఇవే పత్రాలు ఇవ్వాలి).
చివరి తేదీ మార్చి 20: దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 20, 2026 ఆఖరి తేదీ అని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే దరఖాస్తు చేసుకుని, ప్రస్తుతం రైతు భరోసా నిధులు పొందుతున్న పాత రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఏఓ వివరించారు.