గోపన్పల్లి దగ్గర ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం…. ఒకరి పరిస్థితి విషమం
తాండూరు మండలం గోపన్పల్లి దగ్గర ఒడిసిఎం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఓ వ్యక్తికి కాలు విరిగిపోవడంతో మరొక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది. బుధవారం రాత్రి తాండూరు మండలం గోపనపల్లి దగ్గర డీసీఎం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రోడ్డుపై ఇద్దరి యువకులు అపస్వారక స్థితిలో పడి ఉన్నారు. కాగా డీసీఎం డ్రైవర్ ప్రమాదం జరిగినా అనంతరం పరారయ్యారని స్థానికులు తెలిపారు. ఓ యువకుడి కాలు పెరిగింది ఇంకో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. యువకుల వివరాలు మరియు డీసీఎం డ్రైవర్ తదితర వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
